
షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ల 95వ వర్ధంతి సందర్భంగా అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలో యువజనోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలకు సంబంధించిన గోడ పత్రికను ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో SI విష్ణువర్ధన్ మరియు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మేస్రం భాస్కర్ ఆవిష్కరించారు.



















