
పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సాకారం చేస్తుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) అన్నారు. బుధవారం మిర్యాలగూడ మండలం ఐలాపురం, దామరచర్ల మండలం రాళ్లవాగు తండా గ్రామాలలో నూతనంగా నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు.



















