
ప్రధాని నరేంద్ర మోదీ గత పన్నెండేళ్ల పాలనను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు ప్రశంసించారు. శనివారం నిర్మల్ జిల్లా కడెం మండలంలో జరిగిన ఒక కార్యక్రమంలో, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ లు మోదీ పాలనను కొనియాడుతూ, ఆయన నాయకత్వ లక్షణాలను, చారిత్రాత్మక నిర్ణయాలను ప్రస్తావించారు.



















