జి డి ఆర్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్, ఈనెల 11న ప్రతిభా పురస్కారాలు ప్రధానం చేయబోతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమం ముధోల్ తాలుకా లోని పదో తరగతి పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పారితోషకంతో పాటు సన్మానించడం జరుగుతుంది.
సాయంత్రం నాలుగు గంటలకు జి డి ఆర్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో నిర్వహించబడుతుంది.
గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సూచించారు.
ఇతర వివరాలకు, 9441333315 నంబరుకు సంప్రదించవచ్చు.









