నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని కిస్టాపూర్ గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న ఫిష్ ఫండ్ పనులను జిల్లా హెచ్ఆర్ మేనేజర్ సుధాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలకు పలు సూచనలు చేశారు.
జిల్లా హెచ్ఆర్ మేనేజర్ సుధాకర్ కిస్టాపూర్ గ్రామపంచాయతీలో జరుగుతున్న ఫిష్ ఫండ్ పనుల పురోగతి, నాణ్యతను సమీక్షించారు. ఎండల తీవ్రత దృష్ట్యా కూలీలు ఉదయం వేళల్లోనే పనులకు హాజరుకావాలని, ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
హాజరు విధానంపై కూలీలకు అవగాహన కల్పించారు. రోజుకు రెండుసార్లు ఫోటో ఆధారిత హాజరు నమోదు తప్పనిసరి అని, పనుల్లో పారదర్శకత, సమయపాలన పాటించాలని సూచించారు. ఫిష్ పాండ్ల వల్ల గ్రామానికి కలిగే ప్రయోజనాలను, ఆదాయ అవకాశాలను వివరించారు.











