హైదరాబాద్ లోని రవీంద్ర భారతి లో జరిగిన గజల్ సాహిత్య వేదిక ఆరవ వార్షికోత్సవంలో ప్రముఖ కవి మహమ్మద్ షరీఫ్ కు ఘన సన్మానం జరిగింది.
ఈ కార్యక్రమంలో కవికి నిర్వాహకులు సన్మానించారు. ప్రాచీన, ఆధునిక సాహిత్య ప్రక్రియలలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఇ.వి శర్మ, మాధవరావులు ఆయనను సన్మానించారు.
సన్మాన గ్రహీత మహమ్మద్ షరీఫ్ కు పలువురు కవులు మరియు సాహిత్య ప్రముఖులు అభినందనలతో కూడిన సందేశాలు పంపారు.












