బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 28
బోథ్ మండల కేంద్రంలో ఆగస్టు 2వ తేదీన జరగనున్న కొట్టాల పోచమ్మ ఆషాడ బోనాల జాతరకు ముఖ్యఅతిథిగా హాజరు కావాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను గ్రామస్తులు, కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికను అందజేశారు.
బోథ్ మండల కేంద్రంలో ఆగస్టు 2వ తేదీన పెద్దఎత్తున జరిగే కొట్టాల పోచమ్మ ఆషాడ బోనాల జాతరకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కు గ్రామస్తులు, కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ కార్యక్రమంలో విడిసి చైర్మన్ అల్ల కొండ పోతన్న, మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, రమణ గౌడ్, ఎలుక రాజు, మెడిచేల్మా ప్రవీణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.












