హైదరాబాద్, 2026-06-05
హైదరాబాద్ నగరంలోని పేదల కోసం ఎర్రగడ్డలో రూ.1,100 కోట్లతో నిర్మించిన వెయ్యి పడకల టిమ్స్ సనత్నగర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నేడు ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు దీనిని ప్రారంభించనున్నారు.
హైదరాబాద్ నగరంలోని పేదల కోసం ఎర్రగడ్డలో రూ.1,100 కోట్లతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన వెయ్యి పడకల టిమ్స్ సనత్నగర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నేడు ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు ఆసుపత్రిని ప్రారంభించి, వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఆసుపత్రి వివరాలు
మొత్తం 22.6 ఎకరాల విస్తీర్ణంలో ఐదు బ్లాకులతో ఈ అత్యాధునిక ఆసుపత్రిని నిర్మించారు. ఇందులో సుమారు 200 మంది వైద్య సిబ్బంది రోగులకు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆధునిక వైద్య పరికరాలు, వసతులతో టిమ్స్ ఆసుపత్రి పేదలకు నాణ్యమైన వైద్య సేవలను అందించే లక్ష్యంతో ఏర్పాటు చేయబడింది.












