నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలంలో గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి బుధవారం పలు గ్రామాల్లో కోట్లాది రూపాయల విలువైన అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి, శంకుస్థాపనలు చేశారు. మహిళా సంఘ భవనాలు, వర్కింగ్ షెడ్లు, అంగన్వాడీ భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు, పాఠశాల కాంపౌండ్ల నిర్మాణ పనులు ఇందులో భాగంగా ఉన్నాయి.
గ్రామాల సమగ్రాభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఈ దిశగా నిధుల కేటాయింపు జరుగుతోందని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. సారంగాపూర్ మండలంలోని బోరిగాం, గొడిసెర, ధని, మలక్ చించోలి, వంజర్, ప్యారమూర్, వైకుంఠపూర్, కంకెట గ్రామాల్లో ఆయన బుధవారం పర్యటించి, వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు.
బోరిగాం గ్రామంలో రూ. 20 లక్షలతో రెండు మహిళా సంఘ భవనాలు, రూ. 20 లక్షలతో రెండు వర్కింగ్ షెడ్లు, రూ. 12 లక్షలతో అంగన్వాడీ భవనం, రూ. 9 లక్షలతో యూపీఎస్ స్కూల్ కాంపౌండ్, రూ. 20 లక్షలతో గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా, గొడిసెరలో రూ. 10 లక్షలతో మహిళా సంఘ భవనం, రూ. 10 లక్షలతో వర్కింగ్ షెడ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు.
ధని గ్రామంలో రూ. 20 లక్షలతో రెండు మహిళా సంఘ భవనాలు, రూ. 20 లక్షలతో రెండు వర్కింగ్ షెడ్లు, రూ. 12 లక్షలతో అంగన్వాడీ భవన నిర్మాణానికి, మలక్ చించోలిలో రూ. 10 లక్షలతో మహిళా సంఘ భవనం, రూ. 10 లక్షలతో వర్కింగ్ షెడ్, రూ. 24 లక్షలతో రెండు అంగన్వాడీ భవనాల నిర్మాణానికి, వంజర్ గ్రామంలో రూ. 10 లక్షలతో మహిళా సంఘ భవనం, రూ. 10 లక్షలతో వర్కింగ్ షెడ్, రూ. 20 లక్షలతో గ్రామ పంచాయతీ భవనం, రూ. 12 లక్షలతో అంగన్వాడీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.
ప్యారమూర్, వైకుంఠపూర్, కంకెట గ్రామాల్లో కూడా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ప్యారమూర్ లో రూ. 10 లక్షలతో భవనం, రూ. 10 లక్షలతో వర్కింగ్ షెడ్, రూ. 20 లక్షలతో గ్రామ పంచాయతీ భవనం, రూ. 12 లక్షలతో అంగన్వాడీ భవనం, రూ. 35 లక్షలతో ప్రైమరీ స్కూల్ కాంపౌండ్ నిర్మాణానికి, వైకుంఠపూర్ లో రూ. 10 లక్షలతో మహిళా సంఘ భవనం, రూ. 10 లక్షలతో వర్కింగ్ షెడ్, రూ. 12 లక్షలతో అంగన్వాడీ భవనం, రూ. 10 లక్షలతో ప్రైమరీ స్కూల్ కాంపౌండ్, రూ. 20 లక్షలతో యూపీఎస్ స్కూల్ కాంపౌండ్ నిర్మాణానికి, కంకెటలో రూ. 10 లక్షలతో మహిళా సంఘ భవనం, రూ. 10 లక్షలతో వర్కింగ్ షెడ్, రూ. 24 లక్షలతో రెండు అంగన్వాడీ భవనాలు, రూ. 10 లక్షలతో ప్రైమరీ స్కూల్ కాంపౌండ్ నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ నాయకులు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


