నిర్మల్ జిల్లా బైంసా మండలం చూచుంద్ గ్రామంలో, గ్రామ ప్రజల అవసరాల నిమిత్తం నిర్మించనున్న విలేజ్ ఆర్గనైజేషన్ (వివో) భవన నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాచేవార్ గణేష్, ఉపాధి హామీ పథకం అధికారి ఏపిడి నాగవర్ధన్, ఏపీవో లక్ష్మారెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీలత, సాంకేతిక సహాయకులు సాగర్, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మణ్, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
ఏపిడి నాగవర్ధన్ మాట్లాడుతూ, ఈ వివో భవనం మహిళా సంఘాల కార్యకలాపాలు, సమావేశాలు నిర్వహణకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు.
గ్రామాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలలో భాగంగా ఈ భవన నిర్మాణం చేపట్టినట్లు ఆయన తెలిపారు.
నిర్మాణ పనులను వేగవంతం చేసి, త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను సూచించారు.


