జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు బైంసా మున్సిపాలిటీలో పర్యటించనున్న నేపథ్యంలో, చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్తో కలిసి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మౌలిక వసతుల కల్పనపై సమీక్షించారు.
కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మున్సిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయం, అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థతో పాటు ఇతర మౌలిక వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
అభివృద్ధి పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా జరగాలని, పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. మంత్రి పర్యటన విజయవంతం కావడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ పర్యటనలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, మున్సిపల్ కమిషనర్ సిద్ధికి కుతిజా, పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. పర్యటన సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై కూడా సమీక్ష జరిగింది.









