బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 17
నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని బైంసా పట్టణంలోని నాగదేవత ఆలయంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రసాద వితరణ కార్యక్రమం వైభవంగా జరిగింది. భక్తులకు ప్రత్యేక ప్రసాదాలను పంపిణీ చేశారు.
నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని బైంసా పట్టణంలోని నాందేడ్ రోడ్డులో గల నాగదేవత ఆలయం వద్ద మున్నూరు కాపు సంఘం గణేష్నగర్ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు.
భక్తుల దర్శనం
భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి నాగదేవతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు తోట రాము, కార్యదర్శి శ్రీకాంత్, ఉపాధ్యక్షులు నారాయణతో పాటు రాజు, నవీన్, జి. ముత్తన్న, రాములు, నరేష్ తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.












