
గుజరాత్లోని రాజులాలో జరిగిన దారుణం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమ చెల్లెలితో ప్రేమ వ్యవహారం నడిపాడన్న కారణంతో ముగ్గురు సోదరులు కలిసి ఓ యువకుడిని అత్యంత కిరాతకంగా కొట్టి చంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.



















