
జన గణనలో భాగంగా ప్రవేశపెట్టిన స్వయం గృహ గణన ప్రక్రియలో ప్రజలు తమంతట తాముగా ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకోవచ్చని స్థానిక మునిసిపల్ కమిషనర్ జి. శ్రీనివాస్ తెలిపారు. ఈ ప్రక్రియ ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు కొనసాగుతుందని, ఇంటర్నెట్ సౌకర్యం లేనివారికి ఇంటింటి సర్వే ఉంటుందని ఆయన పేర్కొన్నారు.



















