
నిర్మల్ జిల్లా, సారంగాపూర్: ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్ధుల్ హాది పిలుపునిచ్చారు. సోమవారం పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, రైతులకు మద్దతు ధర గురించి వివరించారు.



















