
తెలంగాణలో విద్యా సంస్కరణల నేపథ్యంలో ఇంటర్మీడియట్ను పాఠశాల విద్యలో విలీనం చేయాలనే ప్రతిపాదనను ప్రస్తుత విద్యా సంవత్సరానికి తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ విద్యా సంవత్సరం యథావిధిగా ఇంటర్మీడియట్ ప్రవేశాలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు.



















