
లోకేశ్వరం మండలంలోని కిష్టాపూర్ గ్రామపంచాయతీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ జలసిరి కార్యక్రమంలో భాగంగా బోర్వెల్ రీఛార్జ్ గుంత ఏర్పాటుకు ఈరోజు మార్కింగ్ చేపట్టారు. భూగర్భ జలాలను పరిరక్షించడం, వర్షపు నీటిని భూమిలోకి ఇంకించడం ద్వారా బోర్వెల్లలో నీటి మట్టాన్ని పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.



















