
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందజేసే యూనిఫాంల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని, ఆగస్టు 15 నాటికి పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నాణ్యత, సైజులపై విద్యార్థుల నుంచి వాట్సాప్ ద్వారా ఫీడ్బ్యాక్ సేకరిస్తామని తెలిపారు.



















