
తానూర్ మండలంలోని ఝరి బి గ్రామంలో డెంగ్యూ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు గైక్వాడ్ సాయినాథ్, ఆశ వర్కర్ మైనా బాయి పాల్గొన్నారు. వర్షాకాలంలో డెంగ్యూ వ్యాప్తి చెందకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు.


















