
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం కేవలం అధికార వ్యవస్థ కాదని, ప్రజలకు జవాబుదారీగా, పారదర్శకంగా ఉండాలని సీహెచ్.వి. ప్రభాకర్ రావు అన్నారు. ఎన్నికల్లో గెలుపు అధికారాన్ని ఇస్తుందని, అయితే ఆ అధికారానికి నైతికత, చట్టబద్ధత, ప్రజల విశ్వాసాన్ని జవాబుదారీతనం, సమర్థ పాలనే కల్పిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రశ్నించే హక్కును ప్రజలు ఎప్పటికీ వదులుకోరని, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యతే ప్రజాస్వామ్యానికి ప్రాణమని తెలిపారు.



















