
తానూర్ మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు 5 రోజుల శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ అమీర్ ఖాన్ మాట్లాడుతూ, గ్రామీణాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర అత్యంత కీలకమని, వారు తమ వార్డుల్లో సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో చురుగ్గా వ్యవహరించాలని సూచించారు.



















