
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను సకాలంలో ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, చేతికి వచ్చిన ధాన్యాన్ని మధ్యవర్తులకు అమ్మి ఆర్థికంగా నష్టపోతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా మక్కజొన్న పంట చేతికి వచ్చిన ఈ సమయంలో కొనుగోలు కేంద్రాలు లేకపోవడం దళారులకు వరంగా మారిందని రైతులు వాపోతున్నారు.



















