
ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, ఈ దిశగా అవసరమైన అన్ని చర్యలు చేపడుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం బాసరలో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర పర్యటన నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు.



















