
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర ఆలయ పునర్నిర్మాణ మాస్టర్ ప్లాన్ కోసం రూ. 225 కోట్ల నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం పట్ల ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం తన నివాసంలో ఆయన మాట్లాడుతూ, ఒకేసారి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం ముఖ్యమంత్రి ఘనత అని కొనియాడారు.



















