
తెలంగాణ రాజకీయాల్లో అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు వ్యవహారంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపించారు. తనపై జరుగుతున్న నిరాధారమైన అవినీతి ఆరోపణలకు కేసీఆర్ బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు.


















