
నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలంలోని చించోలి(బి) గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను శనివారం అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. కూలీలకు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పనులు సజావుగా సాగాలని, కూలీల సంఖ్య పెంచాలని, కొలతల ప్రకారం వేతనాలు చెల్లించాలని ఆయన అధికారులను ఆదేశించారు.



















