
కుబీర్ మండలం లోని సౌన గ్రామస్తులకు కేటాయించిన ఇండ్ల స్థలాల భూమిని వెంటనే సర్వే చేసి, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకెఎంఎస్) నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జే. రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం భైంసా సబ్కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.



















