
ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా నర్సంపేటలో కోల శంకర్ గౌడ్ అనే డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై మోకుదెబ్బ జాతీయ కమిటీ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనను ప్రభుత్వ హత్యగా అభివర్ణిస్తూ, తక్షణమే కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని, మృతుడి కుటుంబానికి రూ. 2 కోట్ల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేసింది.


















