
రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినపల్లి మండలం, విలాసాగర్ గ్రామంలో సుతారి సంఘం ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ ఏనుగుల కనకయ్య, కార్మికుల సేవలను కొనియాడుతూ, వారి సంక్షేమానికి తోడ్పాటునందించాలని పిలుపునిచ్చారు.



















