
నిర్మల్ జిల్లా నూతన కలెక్టర్ భవేష్ మిశ్రాను సోమవారం ఎస్.టి.యు.టి.ఎస్. (STUTS) జిల్లా నాయకులు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యా ప్రమాణాల మెరుగుదల, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం వంటి అంశాలపై చర్చించారు.



















