
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో నార్కెట్ పల్లి - అద్దంకి హైవే నుండి బోట్యానాయక్ తండా వరకు గల రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారడంతో, తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సీపీఎం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఆరు నెలల్లో పనులు పూర్తి చేయకపోతే ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి హెచ్చరించారు.



















