
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం అమలులో సమూల మార్పులు తీసుకురావాలని యోచిస్తోంది. ఆర్థిక భారం తగ్గించుకుంటూ, అర్హులైన రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా ఈ పథకాన్ని పునఃసమీక్షిస్తున్నట్లు సమాచారం. ఈనెల 30న ఖమ్మం జిల్లా మధిరలో ముఖ్యమంత్రి నిధులను విడుదల చేయనున్నారు.



















