
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసులు ఎదుర్కొంటున్న భూమి, అడవి, సహజ వనరుల దోపిడీకి వ్యతిరేకంగా వాటి రక్షణకై సన్నద్ధమై ఉద్యమాలు నిర్వహించాలని ఆదివాసి సేన రాష్ట్ర అధ్యక్షులు కోవా దౌలత్ రావు మోకాశి పిలుపునిచ్చారు. ములుగు జిల్లా మేడారంలో జరుగుతున్న ఆదివాసి సేన విస్తృతస్థాయి సమావేశాల్లో ఈ పిలుపు వెలువడింది.



















