
బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) పరిపాలనా యంత్రాంగం, విశ్వవిద్యాలయంపై జరుగుతున్న అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండించింది. విద్యార్థులకు ప్రశాంత వాతావరణంలో విద్యాబోధన, పరీక్షలు, ఇతర కార్యకలాపాలు సజావుగా కొనసాగుతున్నాయని విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.



















