
రాష్ట్రంలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని, ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపైనే ఉంటుందని స్పష్టం చేశారు.



















