
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పంచగుడి గ్రామ శివారులో ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమ మట్టి తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కార్యకలాపాలు ప్రభుత్వ ఆదాయానికి, పర్యావరణానికి నష్టం కలిగిస్తున్నాయని, అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తులు మండిపడుతున్నారు.



















