
మెండోరా మండలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ బి. ప్రమోద్, మండల ఎంపీడీవో లక్ష్మణ్ మొక్కల ప్రాముఖ్యతను వివరిస్తూ, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.


















