
నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో, ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు రూ.15 కోట్లతో పట్టణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల ప్రతిపాదనను ఆమోదించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి మాట్లాడుతూ, పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రతిపక్షాలు సహకరించాలని పిలుపునిచ్చారు.



















