
రాష్ట్రంలో రైతుబంధు పథకం అమలు తీరు, చెల్లింపుల్లో జరుగుతున్న ఆలస్యంపై రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. మాజీ రాష్ట్ర జడ్పిటిసి ల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి, ప్రస్తుత ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వంలో చెల్లింపులు నెలల తరబడి ఆలస్యమవుతున్నాయని ఆయన ఆరోపించారు.



















