
బహిరంగ మార్కెట్లో పంటలకు సరైన ధర లభించని నేపథ్యంలో, రైతులు తమ ఉత్పత్తులను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో మద్దతు ధరకు అమ్ముకోవాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ రైతులకు సూచించారు. మొక్కజొన్న, జొన్న కొనుగోలు కేంద్రాలను త్వరలో ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.


















