
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయానికి నూతన కార్యనిర్వహణాధికారిగా (ఈవో) విజయరామారావు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఈవో అంజని దేవి వ్యక్తిగత సెలవుపై వెళ్లడంతో, నిజామాబాద్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న విజయరామారావుకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఇది ఆయనకు రెండోసారి ఈ ఆలయానికి ఈవోగా పనిచేయడం విశేషం.



















