
నిర్మల్ జిల్లాలో సిఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) డెలివరీ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో, లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయని మిల్లులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.



















