
యువతను మత్తు పదార్థాలు, ముఖ్యంగా గంజాయి తమ వలలోకి లాగుతున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గంజాయి వినియోగం, అక్రమ సాగు, రవాణా, విక్రయాలు ప్రజారోగ్యం, కుటుంబ వ్యవస్థ, విద్య, ఉపాధి, సామాజిక భద్రతకు తీవ్రమైన సమస్యగా మారుతున్నాయి. ఈ సమస్యను వ్యక్తిగత స్థాయిలోనే కాకుండా కుటుంబం, విద్యాసంస్థలు, ప్రభుత్వం, సమాజం సమిష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని వనపర్తి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ద్యారపోగు వెంకటేష్ సూచించారు.



















