
తమిళనాడులోని చెన్నై నుండి ప్రారంభమైన రాజీవ్ మెమోరియల్ జ్యోతి యాత్రకు ఆదివారం నిజామాబాద్లో కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ అర్బన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



















